వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందంపై సంతకాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వోక్స్‌ వ్యాగన్‌ వ్యవహారంలో భారీ పరిశ్రమల మంత్రి బొత్సా సత్యనారాయణ శాఖను మారిస్తే సరిపోదని, బొత్సాను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. రాజకీయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయనే జంకుతోనే బొత్సా సత్యనారాయణను తొలగించడానికి ముఖ్యమంత్రి వెనుకాడుతున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ అన్నారు. వైయస్‌ పాలనలో అవినీతి, బంధుప్రీతి పెరిగాయని ఆయన విమర్శించారు. శాఖ మారుతుందే తప్ప ఏమీ కాదనే భావన అవినీతి మంత్రుల్లో భరోసా ఏర్పడుతుందని, ఇది మంచిది కాదని ఆయన అన్నారు. వోక్స్‌ వ్యాగన్‌ వ్యవహారంలో అన్ని విషయాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వోక్స్‌ వ్యాగన్‌ వ్యవహారంలో బొత్సా సత్యనారాయణ రాజీనామాను ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి కోరకపోవడం విచారకరమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నారాయణ అన్నారు. బొత్సాను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X