వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ ఏజెన్సీలో నక్సలైట్‌ ఎన్‌కౌంటర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా జి.కె. వీధి మండలం అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మరణించాడు. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసు స్టేషన్‌పై దాడికి నక్సలైట్లు ప్రయత్నిస్తున్నారని సమాచారం అందుకున్న తాము గాలింపు చర్యలు చేపట్టామని, తమకు సమావేశమైన నక్సలైట్లు తారసపడ్డారని, తమను చూసి నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారని, దాంతో తాము ఎదురుకాల్పులు జరిపామని పోలీసులు చెప్పారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక నక్సలైటు మరణించినట్లు వారు తెలిపారు. సంఘటనాస్థలం నుంచి మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X