వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్సా బర్తరఫ్‌కు గవర్నర్‌ను కోరిన టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వోక్స్‌ వ్యాగన్‌ వ్యవహారంలో ప్రత్యక్ష సంబంధం ఉన్న మంత్రి బొత్సా సత్యనారాయణను బర్తరఫ్‌ చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు గవర్నర్‌ సుశీల్‌కుమార్‌ షిండేకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం గవర్నర్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. సిబిఐ విచారణ పరిధిని విస్తరించాలని కూడా వారు కోరారు. వోక్స్‌ వ్యాగన్‌ పేర స్థలాలు కొన్న ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి, బొత్సా సత్యనారాయణలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

వోక్స్‌ వ్యాగన్‌ వ్యవహారంలో మోసం చేసిన అశోక్‌జైన్‌, జగదీశ్‌ అలగరాజా, భువన్‌ చతుర్వేదీ తదితరులను అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. వోక్స్‌ వ్యాగన్‌ పేర వశిష్ట వాహన్‌కు చెల్లించిన 11 కోట్ల రూపాయల వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నవారందరి బ్యాంక్‌ ఖాతాలను సీజ్‌ చేయాలని వారు కోరారు. వోక్స్‌ వ్యాగన్‌కు సంబంధించిన ఫైళ్లను సీజ్‌ చేయాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం, వోక్స్‌ వ్యాగన్‌ వ్యవహారాల నేపథ్యంలో వెంటనే శాసనసభా సమావేశాలు ఏర్పాటు చేయాలని వారు గవర్నర్‌ను కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X