వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు మేం వ్యతిరేకమనేది అబద్ధం: వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ అభివృద్ధికి 20 వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని తాము చేసిన విజ్ఞప్తికి ఐక్య ప్రగతిశీల కూటమి చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ సానుకూలంగా ప్రతిస్పందించారని తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ (టిఆర్‌సిసిసి) నాయకుడు జి. చిన్నారెడ్డి చెప్పారు. టి ఆర్‌సిసిసి నేతలు గురువారం సోనియా గాంధీని, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ను కలిశారు. వీరితో పాటు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు ఉన్నారు. తెలంగాణ అంశంపై ఈ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులెవరూ మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చిన్నారెడ్డి చెప్పారు.

దిగ్విజయ్‌ సింగ్‌ వచ్చే నెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వెళ్తారని కేశవరావు చెప్పారు. ఐదవ తేదీన కరీంనగర్‌ నుంచి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. ఆరవ తేదీన టిఆర్‌సిసిసి నాయకులతో సమావేశమవుతారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు వదులుకోలేదని, రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు అభివృద్ధి ప్రక్రియ కొనసాగాలనే ఉద్దేశంతోనే ప్యాకేజీ కోసం విజ్ఞప్తి చేశామని కేశవరావు చెప్పారు. తెలంగాణపై నిర్ణయాన్ని సోనియా చేతుల్లో పెట్టినందున దీనిపై కాంగ్రెస్‌ నాయకులు గానీ, టి ఆర్‌యస్‌ నాయకులుగానీ ఏ విధమైన ప్రకటనలు చేయబోరని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X