గొల్లవాగువాగును ఎలా పూర్తి చేస్తారు?: విపక్షాలు
ఆదిలాబాద్: కేటాయింపులు లేకుండా ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల సమీపంలో చేపట్టిన గొల్లవాగు సాగునీటి ప్రాజెక్టును రెండేళ్లలో ఎలా పూర్తి చేస్తారని బారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రతినిధి ప్రభాకర్ ప్రభుత్వ ప్రతినిధులను ప్రశ్నించారు. గొల్లవాగు ప్రాజెక్టుపై ఆదివారంనాడు బహిరంగ చర్చ జరిగింది. ఈ చర్చకు తెలుగుదేశం పార్టీ గైర్హాజర్ అయింది. బిజెపి తరఫున ప్రభాకర్, సమాజ్వాదీ పార్టీ తరఫున భూపతి రెడ్డి హాజరయ్యారు.
ప్రాజెక్టును పూర్తి చేయడానికి 83 కోట్ల 65 లక్షల రూపాయలు అవసరమవుతాయని, ఈ ఏడాది ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించిందని, వచ్చే రెండేళ్లలో అధిక నిధులు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని భూపతిరెడ్డి ప్రశ్నించారు.