వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అవినీతిమయం వైయస్ ప్రభుత్వం: ఇంద్రసేన్
గుంటూరు: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖ్ర్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) మంత్రుల రాజీనామాల ఆమోదం కోసం సిఫార్సు చేయడానికి 12 రోజులు పట్టిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఎంతగా విఫలమైందో అర్థం చేసుకోవచ్చునని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
వైయస్ మంత్రివర్గ సభ్యులు చాలా మంది అవినీతిలో కూరుకుపోయారని, ఈ అవినీతిలో ముఖ్యమంత్రికి కూడా పాత్ర ఉన్నదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 15 శాఖలకు మంత్రులు లేరని, ఉన్న మంత్రులు అవినీతిలో కూరుకుపోయారని, ముఖ్యమంత్రికి కూడా ఈ అవినీతి వ్యవహారాల్లో ప్రమేయం ఉన్నదని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, July 17, 2005, 23:53 [IST]