610 జీవో అమలుకు అనధికారులతో సెల్: వైయస్
హైదరాబాద్: ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సవరించడానికి విడుదలైన 610 జీవో అమలుకు ఇద్దరు అనధికారులతో ప్రత్యేక సెల్ను వేయనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు హామీ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి తెలంగాణ సమస్య గురించి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి 2 రూపాయల ప్యాకేజీని ప్రకటేంచేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఒక అధికారితో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యుల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి (డిడి ఆర్సి) సమావేశం ఇకమీదట రెండు రోజులు జరుగుతుందని, ఒక రోజు మొత్తం సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు.
తాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ను వదులుకోలేదని, దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానవర్గం నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు చెప్పారు. తాము తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్)ని లెక్కచేయమని, టి ఆర్యస్ విమర్శలను తిప్పికొడతామని వారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వారు చెప్పారు.