ఎమ్మెసార్ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ యత్నాలు
హైదరాబాద్: మంత్రి పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరింపజేయడానికి క్రీడల మంత్రి ఎం. సత్యనారాయణరావును కాంగ్రెస్ నాయకులు బుజ్జగిస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కరీంనగర్ శాసనసభ్యులు సోమవారం సత్యనారాయణరావు ఇంటికి వెళ్లి రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తూ సత్యనారాయణరావు తన లేఖను ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి ఆదివారం రాత్రి అందజేశారు. సత్యనారాయణరావు మంత్రి పదవికి రాజీనామా చేయడం ఇది రెండోసారి. దేవాలయ భూముల అక్రమ విక్రయాల కుంభకోణం వ్యవహారంపై ఆయన తన మంత్రిపదవికి మొదటిసారి రాజీనామా చేశారు.
ఆ రాజీనామాను ముఖ్యమంత్రి తిరస్కరించి సత్యనారాయణరావు శాఖను మార్చారు. మంత్రి పదవికి సత్యనారాయణరావు రాజీనామా చేయడం ఇది రెండోసారి. కేవలం పత్రికా వార్తలపై ఆధారపడి రాజీనామా చేయడం సరికాదని సత్యనారాయణరావుకు కాంగ్రెస్ నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దేవాలయ భూముల అక్రమ విక్రయాల ఆరోపణపై అధికారిక నివేదిక ఏదీ రాలేదని, అందువల్ల మంత్రిపదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని వారు ఎమ్మెస్సార్కు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే ససేమిరా అని సత్యనారయణ అన్నారు. మీడియా వార్తలకు మనస్తాపం చెందే సత్యానారాయణరావు మంత్రిపదవికి రాజీనామా చేశారని ప్రదేశ్ కాంగ్రెస కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. ఎమ్మెస్సార్ రాజీనామా వ్యవహారంపై కేశవరావు కాంగ్రెస్ నేత కేశవరావు మంతనాలు జరిపారు.