వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ సమంజసం, ప్రజాభీష్టం కూడా: పవార్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పెట్టుకోవాల్సిన పొత్తులపై ఇప్పుడే నిర్ణయం తీసుకోకూడదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) నిర్ణయించుకుంది. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుంది. సిపిఐ, సిపియంలతో అవగాహనకు వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పిసిసి సోమవారం సమావేశమై చర్చించింది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుతో పాటు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు రాజీవ్ నగరభేరి పేర మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాలని పిసిసి నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల పార్టీ అభ్యర్థుల ఎంపికకు జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పలువురు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Story first published: Monday, July 18, 2005, 23:53 [IST]