వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌ అణచివేతకు యస్పీలకు డిజిపి సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నక్సలైట్ల అణచివేతకు కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) స్వరణ్‌జిత్‌ సేన్‌ ఐపియస్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటయిన ఐపియస్‌ అధికారుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. నక్సలైట్ల అణచివేత విషయంలో కొందరు పోలీసు సూపరింటిండెంట్లు (యస్‌పిలు) చురుకుగా వ్యవహరిస్తుంటే మరికొంతమంది పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ జరిపే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని ఆయన సూచించారు. తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్యానంతరం జరిగిన విధ్వంసం కేసులను సత్వరమే పరిష్కరించాలని కూడా ఆయన సూచించారు. 24 గంటల పోలీసు క్లినిక్స్‌ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X