వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజీనామా ఉపసంహరణకు ఎమ్మెస్సార్ సుముఖత
హైదరాబాద్: రాజీనామా ఉపసంహరణకు క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణరావు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అనునయించడంతో సత్యనారాయణరావు మెత్తబడినట్లు తెలుస్తోంది. వైయస్ శుక్రవారం ఉదయం ఫోన్ చేసి రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరారు. తన భార్య అస్వస్థత కారణంగా తాను కలెక్టర్ల సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు సత్యనారాయణ రావు వైయస్కు చెప్పినట్లు తెలుస్తోంది.
దేవాలయ భూముల అక్రమ విక్రయాల వ్యవహారంలో మనస్తాపం చెందిన సత్యనారాయణరావు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి అందజేశారు. పత్రికల్లో వచ్చే వార్తాకథనాలను పట్టించుకోవద్దని ముఖ్యమంత్రి ఆయనకు సూచించారు. అయినా సత్యనారాయణరావు తన పట్టు వీడలేదు. తన మంత్రిపదవికి సత్యనారాయణ రావు రాజీనామా చేయడం ఇదే రెండోసారి.
Story first published: Friday, July 22, 2005, 23:53 [IST]