వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిఆర్యస్కు ఇచ్చిందేమీ లేదు: పురుషోత్తమరెడ్డి
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్)కి ఇచ్చిన ప్రత్యేక హామీలేవీ లేవని కాంగ్రెస్ నేత, సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో తాను తెలంగాణ అభివృద్ధి గురించే మాట్లాడానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సోనియా గాంధీతో మాట్లాడిన విషయాలను అన్నింటినీ వెల్లడించలేనని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రత్యేక కమిటీని వేయడానికి సోనియా గాంధీ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. మంత్రి పదవుల్లో తెలంగాణకు 40 శాతం, ఆంధ్రా - రాయలసీమకు 60 శాతం రావాలని ఆయన అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తాము గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Story first published: Friday, July 22, 2005, 23:53 [IST]