వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పులిచింతలపై చింతలు తీరుస్తాం: పొన్నాల
వరంగల్: సాంకేతిక కమిటీతో విచారణ జరిపించి పులిచింతల ప్రాజెక్టుపై నెలకొన్న అనుమానాలను తీరుస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. కమిటీ నివేదిక వచ్చేవరకు పులిచింతల పనులు యథావిధిగా కొనసాగుతాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఆయన చెప్పారు. గంటలకు ఒక టియంసి చొప్పున ఎస్ ఆర్యస్పీలోకి వరదనీరు చేరుతోందని ఆయన అన్నారు.
యస్ ఆర్యస్పీలో 1080 అడుగల మట్టం వరకు నీరుందని ఆయన చెప్పారు. లక్ష్మీకాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీరు, కాకతీయ కాలువ ద్వారా 5వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని ఆయన చెప్పారు. కరీంనగర్ ఎల్యండీలోకి 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Wednesday, July 27, 2005, 23:53 [IST]