అర్ధరాత్రి త్రిష డ్యాన్స్లు: పోలీసుల హెచ్చరిక
చెన్నై: సంచలనాలకు కేంద్ర బిందువైన ప్రముఖ సినీనటి త్రిష చెన్నై శివారులోని బీచ్రోడ్లో పిచ్చిగంతులు వేశారు. దీంతో పోలీసులు హెచ్చరించి ఆమెను ఇంటికి పంపించివేశారు. బుధవారం అర్ధరాత్రి త్రిష తన స్నేహితులతో కలిసి కారులో ఈస్ట్కోస్ట్ బీచ్కు వచ్చారు. మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ పెంచి స్నేహితులతో కలిసి డ్యాన్స్లు చేయడం ప్రారంభించారు.
చెన్నై నగర శివారులోని ఈ ప్రాంతంలో బీచ్ గెస్ట్హౌస్లున్నాయి. ఈ గెస్ట్హౌస్లకు సంబంధించినవారు ఇబ్బందులకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరి డ్యాన్స్లు చేస్తున్న నలుగురిలో త్రిష కూడా ఉన్నట్లు కనుక్కున్నారు. వారిని పోలీసులు హెచ్చరించి ఇంటికి పంపించివేశారు. ఈ నలుగురిలో కొందరు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఇలాంటి పనులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెన్నై పోలీసు కమీషనర్ చెప్పారు.