మంత్రులపై క్రిమినల్ చర్యలకు బిజెపి డిమాండ్
నెల్లూరు: ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యవర్గం నిర్ణయించింది. ఈ మేరకు బిజెపి ఆదివారం తీర్మానం చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న రాష్ట్ర మంత్రులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం ప్రకటించాలని కూడా బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బిజెపి ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. ప్రజా సంక్షేమ కార్యాల అమలులో కూడా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. మున్సిపల్ ఒంటరి పోరుకు సిద్ధమైన పార్టీ శక్తియుక్తులను నిరూపించుకోవాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. స్థానికంగా పార్టీని బలోపేతం చేయడానికి సదకాశం ఉందని ఆయన అన్నారు.