వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బోనాల పండుగలో రేణుకాచౌదరి కూతురు
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక పండుగ అయిన బోనాలను ఆదివారంనాడు హైదరాబాద్ ప్రజలు ఉత్సాహపూరితంగా జరుపుకున్నారు. ప్రజలు తండోపతండాలుగా బోనాలతో అమ్మవార్లను దర్శించుకున్నారు. కేంద్ర పర్యాటక మంత్రి రేణుకా చౌదరి కూతురు తేజస్విని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె విదేశీ స్నేహితురాలు క్రిష్టనా కూడా తేజస్వినితో పాటు అమ్మవారిని దర్శించుకుంది.
ప్రజలు తలలపై బోనాలతో, ఊరేగింపులుగా ప్రదర్శనలు నిర్వహిస్తూ అమ్మవారికి అర్చనలు చేశారు. రాష్ట్ర పర్యాటక మంత్రి జె. గీతారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగను ప్రభుత్వ పర్వదినంగా ప్రకటించే అవకాశం లేదని ఆమె అన్నారు.
Comments
Story first published: Sunday, July 31, 2005, 23:53 [IST]