వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజాం షుగర్స్‌ ప్రైవేటీకరణపై సిబిఐ దర్యాప్తు: కాంగ్రెస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన నిజాం షుగర్స్‌కు చెందిన మూడు కర్మాగారాల ప్రైవేటీకరణపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)తో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నాయకులు పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి, పి. నర్సారెడ్డి, ఎం. నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పైసా తీసుకోకుండా నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలను డెల్టా పేపర్స్‌కు కట్టబెట్టారని వారు ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.

నిజాం షుగర్స్‌ ప్రైవేటీకరణపై ఇప్పటికే సభా సంఘం విచారణ జరుగుతోందని, అయితే ఈ సంఘం నివేదిక వచ్చేలోగా సిబిఐ విచారణ జరిపించడం అవసరమని వారన్నారు. మంత్రివర్గం ఆమోదం లేకుండా ముగ్గురు మంత్రుల సబ్‌ కమిటీతో ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారని వారు చెప్పారు. అప్పటి భారీ పరిశ్రమల మంత్రి కోటగిరి విద్యాధరరావు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, అప్పటి మరో మంత్రి పాత్ర ఉన్నదని వారు ఆరోపించారు. నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీల ప్రైవేటీకరణకు కారకులపై అప్పటి మంత్రులపై, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీలను దారాదత్తం చేయడమే కాకుండా డెల్టా పేపర్స్‌కు 160 కోట్ల రూపాయల రాయితీలు కల్పించారని, 30 కోట్ల రూపాయల అమ్మకం పన్నును, 9 కోట్ల స్టాంప్‌ డ్యూటీని మినహాంచారని వారు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X