బిసిలపై కక్షగట్టిన వైయస్: టిడిపి విమర్శ
హైదరాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం బలహీనవర్గాల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు టి. దేవేందర్ గౌడ్, అల్లాడి రాజ్కుమార్ విమర్శించారు. పెత్తందారీ విధానంతో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని తన జాగీర్దార్లాగా వ్యవహరిస్తున్నారని వారు ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు వ్యాఖ్యానించారు. మున్పిసల్ ఎన్నికల కోసం చేపట్టిన జనాభా లెక్కలో సేకరణలో బీసీలు 30 శాతం మాత్రమే ఉన్నారని లెక్కగట్టడం మోసపూరితమని వారన్నారు.
బీసీలను రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అణచివేయాలని రాజశేఖర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తోందని వారన్నారు. అధికారం మత్తులో రాజశేఖర్ రెడ్డి రాష్ట్రం మొత్తం తన సొత్తు అనే పద్ధతిలో బిసిలను అణచివేయాలని ।పభుత్వ ఆలోచన అని ఆయన అన్నారు. జీరోన హీరోగా నిలబెట్టడానికి బిసి వ్యతిరేకతతో వైయస్ వ్యవహరిస్తున్నారని వారన్నారు.