వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరంగల్ జిల్లాలో ఇద్దరు నకిలీ నక్సలైట్ల అరెస్టు
వరంగల్: వరంగల్ జిల్లా పోలీసులు బుధవారంనాడు ఇద్దరు నకిలీ నక్సలైట్లను అరెస్టు చేశారు. నక్సలైట్లమని చెప్పి జిల్లాలో బలవంతపు వసూళ్ల పాల్పడుతున్న ఈ ఇద్దరు నకిలీ నక్సలైట్లను వరంగల్ జిల్లా సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్ల ప్రభాకర్, యాదగిరి అనే ఇద్దరు వ్యక్తులు జెఎంఎస్ పాఠశాల ప్రిన్సిపాల్ను లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. అందుకు ప్రిన్సిపాల్ అంగీకరించకపోవడంతో బేరానికి దిగి 25 వేల రూపాయలు ఇస్తే చాలునని చెప్పారు. ఆ డబ్బులు తాను వాచ్మన్కు ఇచ్చి పోతానని ప్రిన్సిపాల్ వారితో చెప్పి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు మాటువేసి ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Story first published: Wednesday, August 3, 2005, 23:53 [IST]