వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆల్మట్టి నీరు విడుదల చేయండి: ప్రధాని సూచన
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆల్మట్టి నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. ఆల్మట్టి నిండితే మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల ఆల్మట్టి నుంచి నీరు విడుదల చేయాలని ప్రధాని అన్నారు. అయితే అందుకు కర్ణాటక ప్రభుత్వం నిరాకరించింది. ఆల్మట్టి నుంచి తాము నీరు విడుల చేయలేమని కర్ణాటక తేల్చి చెప్పింది. ఆల్మట్టి నుంచి నీరు విడుదల చేస్తే తమ రాష్ట్రంలోని 600 గ్రామాలు మునిగిపోతాయని కర్ణాటక ప్రభుత్వం తెలియజేసింది.
ఇదిలావుంటే, నాగార్జునసాగర్ నీటితో కళకళలాడుతోంది. తమకు 3 టియంసిలకు బదులుగా 30 టియంసిల నీరు విడుదల చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Story first published: Friday, August 5, 2005, 23:53 [IST]