వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణా జిల్లాలో రోడ్డు స్రమాదం: ఐదుగురు మృతి
మచిలీపట్నం: బందరు, గూడురుల మధ్య ఆర్టీసి బస్సు ఆటోను ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం వల్ల ట్రాఫిక్ను దారి మళ్లిస్తుండగా, ఒక ఆర్టీసి బస్సు రోడ్డు దాటుతున్న అమ్మాయిని ఢీకొంది. దీంతో ఆ అమ్మాయి మృతి చెందింది. మొత్తం ఈ సంఘటనలో ఐదుగురు మరణించారు.
ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ఆపద్భందు పథకం కింద 50 వేల రూపాయలేసి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి ఆర్టీసి 25 రూపాయలేసి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో డ్రైవర్తో పాటు 13 మంది ప్రయాణిస్తున్నారు. మృతుల్లో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ఉన్నాడు. గాయపడినవారు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Story first published: Wednesday, August 10, 2005, 23:53 [IST]