వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక మనలను దగా చేస్తోంది: పొన్నాల

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: కర్ణాటక మన రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. కర్ణాటక మన రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనడానికి తాజా ఉదంతమే నిదర్శనమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జూరాల ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో కర్ణాటక నిర్ల్యక్షం ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. మన రాష్ట్రం జూరాల ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 30 కోట్ల రూపాయలు చెల్లించిందని, అయినా కర్ణాటక ప్రభుత్వం పునరాసానికి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.

జలవిద్యుదత్పత్తి పెరిగిన దృష్ట్యా విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేయడంపై మంత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఆ విధమైన డిమాండ్‌ చేయడం బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు. కరెంట్‌ ఛార్జీల పెంపుపై ఆందోళనకు దిగినవారిపై చంద్రబాబు తన హయాంలో తుపాకులు ఎక్కుపెట్టి కాల్చి చంపారని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రకటన ఆయన స్థాయికి తగింది కాదని లక్ష్మయ్య అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X