వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సెక్యులర్ పార్టీలతో పొత్తు, అయితే స్థానికంగానే: కెకె
హైదరాబాద్: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఏ సెక్యులర్ పార్టీతోనైనా తాము పొత్తుకు సిద్ధమేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు చెప్పారు. అయితే పొత్తులు పెట్టుకునే అంశం తన పరిధిలో లేదని, స్థానికంగానే పొత్తులపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుందని, జిల్లా కమిటీలు స్థానిక పరిస్థితులను బట్టి పొత్తులు కుదుర్చుకుంటాయని ఆయన వివరించారు. పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చే పార్టీలు సెక్యులర్ అయి ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేవి అయి ఉండాలని ఆయన అన్నారు. ఉద్యోగాల్లో తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జారీ అయిన 610 జీవో అమలుకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
Story first published: Sunday, August 14, 2005, 23:53 [IST]