వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో గోవింద భార్య, పిల్లలకు గాయాలు
జైపూర్: బాలీవుడ్ నటుడు గోవిందా భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వారు కారులో జైపూర్ నుంచి అజ్మీర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అయితే కారులోనే ప్రయాణిస్తున్న గోవిందా మిత్రుడు రిషాబ్ ప్రమాదంలో మరణించాడు. గోవిందా భార్యను, పిల్లలను, కారు డ్రైవర్ను ఆస్పత్రిలో చేర్చారు. గోవిందా భార్య, పిల్లలు ప్రయాణిస్తున్న కారును బగ్రు వద్ద ఒక ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ట్రక్ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే గోవింద ప్రత్యేక విమానంలో జైపూర్ వచ్చారు. గోవింద భార్య, పిల్లలకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.
Comments
Story first published: Monday, August 15, 2005, 23:53 [IST]