వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సలైట్లనుమోసం చేసిన వైఎస్‌: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రంలోశాంతి భద్రతలు బాగుండాలనే ఆకాంక్షతోఆనాడు నక్సలైట్లతో రాష్ట్ర ప్రభుత్వంజరిపిన చర్చలకు మద్దతు ఇచ్చామనిమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.అప్పుడు తామే నక్సలైట్‌ సమస్యకుపరిష్కారం కనుగొంటామని ప్రగల్భాలుపలికిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిఇప్పుడు ఆ నక్సలైట్‌లపై నిషేధం ఎందుకువిధించారో ప్రజలకు సమాధానం చెప్పాలని, ఇదినక్సలైట్లను, సమాజంలోని అన్ని వర్గాలనూమోసగించినట్టేనని ఆయన అన్నారు.

రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రజాదరణను కోల్పోతోందని,ఇక కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతోపనిచేసి తమ సత్తా చూపించవలసినసమయం ఆసన్నమైందని ఆయన విజ్ఞప్తిచేశారు. మునిసిపల్‌ ఎన్నికలు తెలుగుదేశంపార్టీకి అందివచ్చిన అవకాశం అని, అందుకేకార్యకర్తలు భుజం భుజం కలిపి పని చేయాలనిచంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. ప్రజల్లోతెలుగుదేశం పార్టీ పట్ల గల న మ్మకాన్నివమ్ము చేయబోమని కూడా ఆయన భరోసాఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X