వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్పైనిషేధం వల్ల నష్టం లేదు: మావోయిస్టునేత
హైదరాబాద్:నక్సలైట్లపై నిషేధం విధించడం వల్లఉద్యమానికి ఎటువంటి నష్టం జరగదనిమహబూబ్ నగర్ జిల్లా మావోయిస్టుకార్యదర్శి సాంబశివుడు ఒక ప్రకటనలోపేర్కొన్నారు. మక్తల్ ఎమ్మెల్యే నర్సిరెడ్డి హత్య కేసులో సాంబశివుడేప్రధాన సూత్రధారి అని పోలీసులుపేర్కొన్నారు. కల్తీ కల్లు అమ్మి నూట అరవైమంది ప్రాణాలు కోల్పోవడానికికారకులైనందువల్లనే నర్సిరెడ్డి,వెంకటేశ్వరరెడ్డిలను హత్య చేసినట్టు సాంబశివుడు శుక్రవారం ఒకప్రకటనలో పేర్కొన్నారు. ఇక మీదట మంత్రులు, ఎమ్మెల్యేలవద్ద సామాన్యప్రజలు ఉండకూడదని, ఉంటే ప్రమాదమనిఆయన వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసినట్టుభావిస్తున్న రజిత, శ్యాం, రమాకాంత్, శ్యాంలు క్షేమంగాఉన్నారని, సమాచార లోపం వల్లనే వారుమరణించినట్టు భావించామని సాంబశివుడుచెప్పారు.
Comments
Story first published: Friday, August 19, 2005, 23:53 [IST]