వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలీసాగర్‌పై ఆరోపణల మధ్య బహిరంగచర్చ

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలోని అలీసాగర్‌ ప్రాజెక్టుపై ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. అలీసాగర్‌ ప్రాజెక్టు విషయంలో అనేక అవకతవకలు జరిగాయని తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ।పతినిధులు విమర్శించారు. అలీసాగర్‌ ప్రాజెక్టుపై ఆదివారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో బహిరంగ చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున సాగునీటి పారుదల సలహాదారు సీతాపతిరావు, తెలుగుదేశం తరఫున సానా మారుతి, బిజెపి తరఫున ప్రభాకర్‌ బహిరంగ చర్చల్లో పాల్గొన్నారు.

కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చడానికే ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పెంచారని సానా మారుతి ఆరోపించారు. టెండర్ల ఖరారులో నిబంధనలను కాలరాశారని ఆయన అన్నారు. కాంట్రాక్టర్లకు నాయకుడు సీతాపతిరావేనని ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు పంపిన ప్రశ్నావళి ప్రభుత్వానికి అందిందా అని సానా మారుతి, ప్రభాకర్‌ అడిగారు. అందలేదని సీతాపతి రావు ఇచ్చిన సమాధానానికి వారు మండిపడ్డారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి పర్యటనలో ఉన్నందువల్ల అది సాధ్యం కాలేదని సీతాపతిరావు చెప్పారు. దానికి మరింతగా బిజెపి, తెలుగుదేశం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X