వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ పేరుతో కర్నూలులో దోపిడీ
కర్నూలు: నక్సల్స్ పేరుతో దోపిడీ ముఠా కర్నూలులోని ఒక ఇంటిలో దోపిడీకి పాల్పడింది. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కొండల్రాయుడు ఇంటిపై ముగ్గురు సభ్యులతో కూడిన ముఠా దాడి చేసి 3.5 లక్షల విలువ చేసే బంగారు నగలను, 25 వేల నగలను దోచుకెళ్లింది.
కుటుంబసభ్యుల కథనం ప్రకారం- తమ గన్ పోయిందని, దాని కోసం వెతుకుతున్నామని ముగ్గురు వ్యక్తులు కొండల్రాయుడు ఇంటికి వచ్చారు. వెతుక్కోవాల్సిందిగా వారు చెప్పారు. అయితే వారు హఠాత్తుగా కొండల్రాయుడిపై దాడి చేసి కొట్టి కుత్తుకపై కత్తి ఉంచి దోపిడీకి దిగారు. ఇంట్లో ఉన్న నగలను, నగదును ఎత్తుకెళ్లారు.
Comments
Story first published: Sunday, August 28, 2005, 23:53 [IST]