వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐదుగురు సికాస కార్యకర్తల అరెస్టు
కరీంనగర్: నిషేధ మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)కు చెందిన ఐదుగురిని పోలీసులు కరీంనగర్ జిల్లా రామగుండంలో అరెస్టు చేశారు. సికాసను కూడా ప్రభుత్వం నిషేధించింది. వారి నుంచి రెండు వేల వాల్పోస్టర్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సికాస నాయకుడు శ్రీధర్ ఆదేశాల మేరకు పోస్టర్లు అతికించడానికి ప్రయత్నిస్తుండగా ఆ ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీధర్ ఆదేశాల మేరకు వీరు పోస్టర్లు అతికించడం, భూముల్లో ఎర్రజెండాలు పాతడం చేస్తుంటారని వారు చెప్పారు.
Comments
Story first published: Monday, August 29, 2005, 23:53 [IST]