వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం: 7గురు మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం గ్రామం వద్ద జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఆరుగురు సజీవ దహనం కాగా, ఒక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో బస్సు డీజిల్ ట్యాంక్ పగిలిపోయి మంటలు లేచాయి. లారీ అల్యూమినయం సామగ్రితో కోల్కత్తా నుంచి వస్తోంది. మంటలు లేచిన వెంటనే బస్సు ప్రయాణికులు అద్దాలు పగులగొట్టుకుని బయటపడ్డారు. అయితే నలుగురు వ్యక్తులు సీట్ల కింద ఇరుక్కుపోవడంతో సజీవదహనమయ్యారు. లారీ డ్రైవర్, క్లీనర్ లారీ క్యాబిన్లో సజీవంగా దహనమయ్యారు. బస్సు డ్రైవర్, కండక్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంతో ఆ రోడ్డుపై ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
Comments
Story first published: Tuesday, September 13, 2005, 23:53 [IST]