వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాట్నా దగ్గర బాణసంచా పేలి 32 మంది మృతి
పాట్నా: పాట్నా సమీపంలోని మియాన్ టోలీలో బాణసంచా పేలడంతో 32 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 40 మంది దాకా గాయపడ్డారు. పాట్నాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మియాన్ టోలీలోని రెండు ఫ్యాక్టరీల్లో బాణాసంచా పేలింది. ఈ బాణాసంచాను అక్రమంగా నిల్ల చేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్ బి. రాజేంద్ర చెప్పారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్చారు. రెండు ఫ్యాక్టరీల్లోని శిథిలాల నుంచి 32 మృతదేహాలను వెలికి తీసినట్లు రాజేంద్ర చెప్పారు. శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉండవచ్చునని ఆయన అన్నారు. బాణాసంచాతో పాటు గ్యాస్ సిలిండర్లు కూడా పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. పేలుడు సంభవించిన సమయంలో 100 మంది దాకా గోడౌన్లలో ఉన్నారు. ఏడుగురు అక్కడికక్కడే మరణించగా 13 మంది ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు.
Comments
Story first published: Thursday, September 15, 2005, 23:53 [IST]