వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాట్నా దగ్గర బాణసంచా పేలి 32 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా: పాట్నా సమీపంలోని మియాన్‌ టోలీలో బాణసంచా పేలడంతో 32 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 40 మంది దాకా గాయపడ్డారు. పాట్నాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మియాన్‌ టోలీలోని రెండు ఫ్యాక్టరీల్లో బాణాసంచా పేలింది. ఈ బాణాసంచాను అక్రమంగా నిల్ల చేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్‌ బి. రాజేంద్ర చెప్పారు.

క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్చారు. రెండు ఫ్యాక్టరీల్లోని శిథిలాల నుంచి 32 మృతదేహాలను వెలికి తీసినట్లు రాజేంద్ర చెప్పారు. శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉండవచ్చునని ఆయన అన్నారు. బాణాసంచాతో పాటు గ్యాస్‌ సిలిండర్లు కూడా పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. పేలుడు సంభవించిన సమయంలో 100 మంది దాకా గోడౌన్లలో ఉన్నారు. ఏడుగురు అక్కడికక్కడే మరణించగా 13 మంది ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X