సియంపై ఎన్నికల కమీషన్కు టిడిపి ఫిర్యాదు
హైదరాబాద్: కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు కడియం శ్రీహరి, తదితరులు గురువారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టుల బాట, ఇర్రిగేషన్ మిషన్ పేరుతో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఎన్నికల నిబంధలను ఉల్లంఘిస్తున్నారని కడియం శ్రీహరి ఎన్నికల కమీషనర్ ఎ.వి.యస్. రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు.
అంతేకాకుండా ఎన్నికల అధికారులపై ముఖ్యమంత్రి ఒత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు. సమీక్షల పేర ఎన్నికల విధులను నిర్వహిస్తున్న అధికారులను పిలిపించి ఆదేశాలు ఇస్తున్నారని ఆయన చెప్పారు. ఇర్రిగేషన్ మిషన్ కార్యకలాపాలను, ప్రాజెక్టుల బాటను ఆపించాలని ఆయన ఎన్నికల కమీషనర్ను కోరారు. ఈ విషయాలపై ప్రభుత్వ వివరణ కోరుతామని ఎ.వి.యస్. రెడ్డి చెప్పారు.
ముఖ్యమంత్రి ప్రాజెక్టుల బాట కార్యక్రమంలో పాల్గొనరాదని ఎన్నికల కమీషనర్ ఎ.వి.యస్. రెడ్డి ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికల పరిశీలకులను నియమించారు.