టిఆర్యస్ నేతల వ్యాఖ్యలకు విలువ లేదు: కెకె
ఏలూరు: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) నాయకులు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్ర చేస్తున్న వ్యాఖ్యలకు విలువ లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. టిఆర్యస్ నాయకుల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
సీరియస్ ప్రకటనలు చేస్తే ఏమైనా పట్టించుకోవడానికి వీలుంటుందని, ఆ సీరియస్నెస్ టిఆర్యస్ నాయకుల్లో లేదని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలను నైతిక దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకోబోమని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టి ఆర్యస్ తమ మద్దతుతోనే సీట్లు గెలుచుకుందని ఆయన అన్నారు. అటువంటి టిఆర్యస్కు అంత సీను లేదని ఆయన అన్నారు. తమకు మున్పిపాలిటీల్లో 75 స్థానాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒక వేళ తమ పార్టీకి మెజారిటీ రాకుంటే అందుకు తాను బాధ్యత వహిస్తానని ఆయన చెప్పారు. ఎకె 47లకు, టిఆర్యస్ రాళ్లకు తాము భయపడేది లేదని ఆయన అన్నారు.
తెలంగాణలో టి ఆర్యస్ ప్రభావం కన్నా తమ ప్రభావమే ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. తమ పార్టీలో రెబెల్స్ ఉండబోరని ఆయన చెప్పారు.