వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిసిసిఐ ఎన్నికలపై కోల్కత్తా హైకోర్టు స్టే
కోల్కత్తా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఎంజియం)పై, ఎన్నికల ప్రక్రియపై కోల్కత్తా హైకోర్టు స్టే విధించింది. జగన్మోహన్ దాల్మియా దాఖలు చేసిన అప్పీల్పై విచారణ ముగిసిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని కోల్కత్తా హైకోర్టు ఆదేశించింది.
ఎన్నికల కోసం మరో ఇద్దరు పరిశీలకులను నియమిస్తూ జస్టిస్ సౌమిత్రా సేన్ జారీ ఆదేశాలను బిసిసిఐ అధ్యక్షుడు రణబీర్ సింగ్ మహేంద్ర, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సవాల్ చేయడం జరిగింది. కేవలం 30 ఓటర్ల కోసం ముగ్గురు పరిశీలకులు అవసరం లేదని వాదిస్తూ బిసిసిఐ ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు.
Comments
Story first published: Friday, September 23, 2005, 23:53 [IST]