వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయవాడలోని 14 డివిజన్ల పోలింగ్‌ వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: విజయవాడ నగర పాలక సంస్థలోని 14 డివిజన్ల ఎన్నికల పోలింగ్‌ వాయిదా పడింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక మేరకు 14 డివిజన్లలో పోలింగ్‌ను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ నిర్ణయం తీసుకుంది. వరదల వల్ల చేరిన నీరు ఇంకా తొలగకపోవడంతో ఈ డివిజన్లలో పోలింగ్‌ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకన్నారు. ఈ డివిజన్లలో ఈ నెల 30వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. విజయవాడలోని 1, 26, 27, 29 డివిజన్లలో, 51 నుంచి 59 డివిజన్లలో పోలింగ్‌ వాయిదా పడింది. విజయవాడలో మొత్తం 59 డివిజన్లు ఉన్నాయి.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు పోలీసులు తెలుగుదేశం పార్టీపై 14, కాంగ్రెస్‌పై తొమ్మిది, మజ్లీస్‌పై రెండు, సిపియం, తెరాసలపై ఒక్కటేసి, ఇతరులపై 30 కేసులు నమోదు చేశారు. మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో డబ్బులు పంచుతున్న తెరాస కార్యకర్తలను పోలీసులు పట్టుకున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నల్లగొండలో మద్యం పంచుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X