వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్, బాబు చేయా చేయి కలిపిన వేళ
హైదరాబాద్: నిన్నటి దాకా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్న ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం నవ్వుతూ పలకరించుకన్నారు. పరస్పరం కరచాలనం చేసుకున్నారు. స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి ఇచ్చిన అల్పాహార విందులో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. శాసనసభ సమావేశాలకు ముందు స్పీకర్ అల్పాహార విందు ఇవ్వడం సంప్రదాయం. అందులో భాగంగానే బుధవారం స్పీకర్ అల్పాహార విందు ఇచ్చారు.
ఈ అల్పాహార విందుకు అన్ని పార్టీ శాసనసభా పక్ష నేతలు హాజరయ్యారు. గత సమావేశాల సందర్భంగా స్పీకర్ ఇచ్చిన అల్పాహార విందును తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. తమ శాసనసభ్యుడు పరిటాల రవి హత్యకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆ విందుకు హాజరు కాలేదు.
Comments
Story first published: Wednesday, September 28, 2005, 23:53 [IST]