వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐడియల్లో అగ్నిప్రమాదం: ఒకరి మృతి
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని కూకట్పల్లి వద్ద గల మూసాపేటలోని ఐడియల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఐడియల్లో అకస్మాత్తుగా మంగళవారం మధ్యాహ్నం మంటలు లేచాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిని అస్ప6తికి తరలించారు. మృతుడిని జ్ఞానేశ్వర్గా గుర్తించారు. ప్రమాదానికి కారణాలు తెలియడం లేదు.
ప్రమాద స్థలాన్ని హోం మంత్రి కె. జానారెడ్డి సందర్శించారు. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. మీడియా ప్రతినిధులను ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. ఇదే ఫ్యాక్టరీలో రెండేళ్ల క్రితం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనమండుగురు మరణించారు.
Comments
Story first published: Tuesday, October 4, 2005, 23:53 [IST]