వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ హామీతో రాజీనామా ఉపసంహరణ: ఎమ్యెల్యే
హైదరాబాద్: తనపై, కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు చేసిన దాడి సంఘటన విషయంలో న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారని, ఈ హామీ మేరకు తాను రాజీనామాను ఉపసంహరించుకున్నానని కాంగ్రెస్ శాసనసభ్యుడు తోటపల్లి గోపాలకృష్ణ చెప్పారు. సామర్లకోటలో రీపోలింగ్ సందర్భంగా పోలీసులు కొట్టిన దెబ్బలకు తోటపల్లి గోపాలకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. చేతికట్టుతో ఆయన మంగళవారం శాసనసభకు హాజరయ్యారు.
పోలీసుల దాడికి నిరసనగా తోటపల్లి గోపాలకృష్ణ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పోలీసులు తనపైనా, కాంగ్రెస్ కార్యకర్తలపైనా దాడి చేసి తీవ్రంగా కొట్టారని గోపాలకృష్ణ మంగళవారంనాడు మీడియా ప్రతినిధులతో అన్నారు. దాడిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Tuesday, October 4, 2005, 23:53 [IST]