వన్డే సూపర్ సిరీస్: ప్రపంచ విజేత ఆస్ట్రేలియా
మెల్బోర్న్: వరల్డ్ ఎలెవన్పై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అపూర్వ విజయాన్ని నమోదు చేసుకుంది. మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసి ప్రపంచ విజేతగా నిలిచింది. ప్రపంచంలోని హేమాహేమీలున్న వరల్డ్ ఎలెనన్ జట్టు ఏ స్థాయిలోనూ ఆస్ట్రేలియాకు పోటీని ఇవ్వలేకపోయింద. ముఖ్యంగా వరల్డ్ ఎలెవన్ జట్టులోని బ్యాట్స్మెన్ ఏ మాత్రం ఆస్ట్రేలియా బౌలర్ల ముందు నిలబడలేకపోయారు. ఆదివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా 156 పరుగుల ఆధిక్యతతో గెలుపొందింది. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 293 పరుగులు చేయగా, వరల్డ్ ఎలెవన్ 137 పరుగులకే కుప్పకూలింది. గిల్క్రిస్ట్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లు బ్రెట్లీ, వాట్సన్ చెరి నాలుగేసి వికెట్లు తీసుకున్నారు. మాక్గ్రాత్ ఒక వికెట్ తీసుకున్నాడు.
వరల్డ్ ఎలెవన్ జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. వీరేంద్ర సెహ్వాగ్ 38 పరుగులు చేయగా, సంగరక్క 13 పరుగులు చేశారు. లారా ఈ మొత్తం సిరీస్లో ఏ మాత్రం రాణించలేదు. సంగరక్క మాత్రమే కాస్తా ఫరవాలేదనిపించాడు. భారత్ బ్యాట్స్మన్ రాహుల్ ద్రావిడ్ కూడా ఆస్ట్రేలియా బౌలర్ల ముందు ఈ సిరీస్లో నిలువలేకపోయాడు. బంతులను మెరుపుల్లా బౌండరీ దాటించే సయ్యద్ ఆఫ్రిదీ చేతులెత్తేశాడు. బౌలర్లలో మురళీకార్తిక్ కూడా అంతగా రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్లో మురళీ రెండు వికెట్లు తీసుకున్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ వరల్డ్ ఎలెవన్ బౌలర్ల వేసిన బంతులను తుత్తునియలు చేశారు. గిల్క్రిస్ట్ 32 పరుగులు చేయగా, పాంటింగ్ 68 పరుగులు చేశాడు. హస్సీ 75 పరుగులు చేశాడు. వాట్సన్ 66 పరుగులు చేశాడు.