వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యస్ఆర్యస్పిపై బహిరంగ చర్చ గందరగోళం
వరంగల్: శ్రీరాంసాగర్ వరద కాలువపై బహిరంగ చర్చ ఆదివారంనాడు తీవ్ర గందరగోళంగా మారింది. ఎస్ ఆర్యస్పి వరద కాలువ విషయంలో అనేక అవకతవకలు జరిగాయని తెలుగుదేశం పార్టీ ప్రతినిధి సానా మారుతి ఆరోపించారు. ఒకానొక సందర్భంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సానా మారుతి తన ముందున్న మైక్లను విసిరికొట్టారు. అధికారులు సరైన సమాధానాలు ఇవ్వడం లేదంటూ ఆయన ఆగ్రహం చెందారు.
ఎస్ ఆర్యస్పి వరదకాలువ టెండర్లలో అవకతవకలు జరిగాయని సానా మారుతి ఆరోపించారు. ఈ ప్రాజెక్టు వ్యయం 350 కోట్ల రూపాయల నుంచి 630 కోట్ల రూపాయలకు పెరగడంలో అవినీతి చోటు చేసుకుందని ఆయన అన్నారు. దీన్ని ప్రభుత్వాధికారులు అంగీకరించలేదు. యస్ఆర్యస్పి వరద కాలువ పనులను తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని బిజెపి విమర్శించింది.
Comments
Story first published: Sunday, October 9, 2005, 23:53 [IST]