వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు ప్రమాదాలు: 13 మంది దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు చోట్ల ఆదివారంనాడు జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గుంటూరు జిల్లా చిలుకలూరిపేట మండలం తాటిపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. తిరువూరు నుంచి ఒక శుభకార్యానికి ప్రయాణికులతో ఒంగోలు వెళ్తున్న క్వాలిస్‌ ఆర్టీసి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న 8 మంది మరణించారు. మృతులు కృష్ణా జిల్లా తిరువూరుకు చెందినవారు.

నెల్లూరు జిల్లా గూడూరు వద్ద ఇందూరు నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్‌ చెన్నై నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మరణించారు. నలుగరు అక్కడికక్కడే మరణించగా, ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మరో పది మంది గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X