వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాయిదా తీర్మానాలపై విపక్షాల పట్టు: సభ వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: భారత్‌, శ్రీలంకల మధ్య చెన్నైలో జరిగిన తొలి క్రికెట్‌ టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా మూడున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకు పోయింది. ఇరు జట్ల మ్యాచ్‌ సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ అత్యల్ప స్కోర్‌కు ఆలవుట్‌ అయింది. భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 167 పరుగులకు వికెట్లన్నీ కోల్పోయింది. ఏ ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా అర్థసెంచరీ సాధించలేకపోయాడు. ద్రావిడ్‌ 32 పరుగులు, సచిన్‌ టెండూల్కర్‌ 22 పరుగులు, ధోనీ 30 పరుగులు చేశారు. వివియస్‌ లక్ష్మణ్‌, సౌరవ్‌ గంగూలీ ఐదేసి పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ దారి పట్టారు. 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్‌ చామిండా వాస్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

భారత్‌ అలవుట్‌ అయిన అనంతరం తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక చాలా త్వరగానే ఓవెనర్‌ గుణవర్ధనే వికెట్‌ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత నిలకడగా ఆడింది. జయవర్ధనే 71 పరుగులు చేశాడు. కుంబ్లే మూడు వికెట్లు తీయగా పఠాన్‌కు ఒక వికెట్‌ లభించింది. చివరి రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. రెండో టెస్టు ఢిల్లీలో ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X