వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దయానిధి మారన్‌తో బిల్‌గేట్స్‌ చర్చలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌కు, భారత ప్రభుత్వ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రి దయానిధి మారన్‌కు మధ్య మంగళవారం చర్చలు జరిగాయి. వీరిరువురి మధ్య దాదాపు 20 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. బుధవారం కూడా వీరు తిరిగి సమావేశమవుతారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బిల్‌ గేట్స్‌ మంగళవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు.

ఇ-గవర్నర్నెన్స్‌పై, ఐటి సేవలపై గత సెప్టెంబర్‌లో దయానిధి మారన్‌ అమెరికా పర్యటన సందర్భంగా బిల్‌గేట్స్‌తో ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ విషయాలపై కూడా ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. గేట్స్‌ ఫౌండేషన్‌ భారత్‌లో చేపట్టిన కార్యక్రమాలను బిల్‌గేట్స్‌ తన పర్యటన సందర్భంగా సమీక్షిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X