వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల పరస్పర కాల్పులు హైదరాబాద్‌: ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు హైదరాబాద్‌ శివారులోని రాజేంద్రనగర్‌లో పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో ఆ ఇరువురు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఈ సంఘటన రాజేంద్రనగర్‌లోని అసిస్టెంట్‌ పోలీసు కమీషనర్‌ (ఎసిపి) కార్యాలయం ముందే జరగడం గమనార్హం.

By Staff
|
Google Oneindia TeluguNews

ఫిరోజ్‌ఖాన్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, మరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి భూముల విషయంలో చాలా కాలంగా గొడవలు పడుతున్నారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఈ విషయమై మాట్లాడడానికి తన ఆఫీసుకు రావాలని వారిద్దరిని ఎసిపి రాజేంద్ర ఆదేశించారు. ఈ మేరకు వారు శుక్రవారంనాడు ఎసిపి ఆఫీసుకు వచ్చారు. బయట వేచి ఉండాల్సిందిగా ఎసిపి చెప్పారు. ఈ సమయంలో ఆ ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు గొడవ పడి తమ వద్ద ఉన్న రైఫిల్స్‌తో పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో ఫిరోజ్‌ఖాన్‌ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వారికి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం తెలియదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X