అస్సాంలో కొత్త విద్యార్ధి సేన
గౌహతి: స్థానికుల హక్కులను పరిరక్షించడానికి సమైఖ్య అస్సాం విద్యార్ధి సంఘం( ఆసు) అసోంసేన అనే సంస్థ ఏర్పాటైంది. ఉద్యోగాలలో స్థానికులకు రిజర్వేషన్, అస్సాం సంస్కృతిపై స్థానికేతరుల దాడిని తిప్పికొట్టడమనే లక్ష్యాలతో ఈ సంస్థను ఏర్పాటు చేశామని అసాంసేన ఛీఫ్ కన్వీనర్ సముజ్జల భట్టాచార్జీ తెలిపారు. అసాంసేన నిరాయుధ ప్రాంతీయ సైన్యంగా పనిచేస్తుందని, స్థానికుల ఆసక్తిలకు హానిచేసే శక్తులపై త్రీవంగా పోరాడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలలో కనీసం క్రింది స్థాయి ఉద్యోగాలు కూడా స్థానిక యువకులకు లభించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ఠ్రంలోని కేంద్ర, రాష్ట్ర స్థాయి సంస్థలలో కంపెనీలలో స్థానిక యువకులకే ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్తో అసాంసేన ముందుకు నడుస్తుందని ఆయనతెలిపారు. రాష్ట్రంలోని వివిధ భాషాపరమైన, మతపరమైన సంఘాల మధ్య ఐకమత్యానికి కూడా సేన పాటుపడుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర సమస్యలపై అహింసాయుతంగా, రాజకీయాలకు అతీతంగా సంస్థ పోరాడుతుందని భట్టాచార్జీ అన్నారు. అసాంసేన ఎట్టి పరిస్థితుల లోను మిలిటెంట్ సంస్థగా మారదని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలలోని ప్రజలతో సంస్థ కేడర్ను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.