వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హత్యారాజకీయాలపై విరుచుకుపడిన చంద్రబాబు
నర్సరావుపేట: కాంగ్రెస్ ప్రభుత్వం హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని, దానికి తగిన మూల్యాన్ని వారు వడ్డీతో సహా చెల్లించుకోవలసి ఉంటుందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. నవంబర్ 26న హత్యకు గురైన నర్సరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం నాయకుడు జల్లిపల్లి అంజిబాబు కుటుంబసభ్యులను ఆయన శనివారం విప్పర్లలో ఆయన పరామర్శించారు. ఇక మీదట ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు హాని చేసినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. హత్యకు గురైన అంజిబాబు కుటుంబసభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ తన కన్న తల్లి వంటిదని, తెలుగుదేశం కార్యకర్తలకు హానిచేస్తే సహించబోమని ఆయన అన్నారు. అంజిబాబు హత్యకు కుట్ర పన్నిన నర్సరావుపేట డీస్పీపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Story first published: Saturday, December 10, 2005, 23:53 [IST]