వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణను కాంగ్రెస్ శాసనసభ్యుడు కిరణ్కుమార్ రెడ్డి ఖండించారు. ఉద్రిక్తతలను పెంచి పోషించే విధంగా చంద్రబాబు ప్రకటనలు చేయడం మంచిది కాదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు హత్యలకు గురయ్యారని, ఆ హత్యలన్నీ చంద్రబాబునాయుడే చేయించారని అనడం సమంజసంగా ఉంటుందా అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డిని తెలుగుదేశం నాయకులు హత్య చేశారని, ఈ హత్యను చంద్రబాబు చేయించారని తాము అనడం లేదని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు హుందాగా వ్యవహరించడం మంచిదని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, December 11, 2005, 23:53 [IST]