వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైతు బజార్లను నీరుగారుస్తున్న ప్రభుత్వం: బాబు
హైదరాబాద్: రైతు బజార్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి ఏర్పాటు చేసిన రైతు బజార్లను నిర్వీర్యం చేస్తూ మధ్య దళారీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
రైతుల బజార్ల ఎస్టేట్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వాటి పర్యవేక్షణ జరగడం లేదని ఆయన అన్నారు. రైతులు తమ పంటలను రైతు బజార్లకు తీసుకొని రావడానికి వేసిన బస్సులను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలను అంటుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లనే నిత్యావసర సరుకుల ధరలు అనూహ్య రీతిలో పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, December 23, 2005, 23:53 [IST]