వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముడుపులు తీసుకుంటూ పట్టుబడ్డ యంపీలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుపై శుక్రవారం రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. పంబంధిత మంత్రి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని సిపియం సభ్యురాలు బృందా కారత్ పదే పదే పోలవరంపై వివరణ కోరారు. దీంతో కాస్తా గందరగోళం చోటు చేసుకుంది.
పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లభించిందా అని సిపియం సభ్యురాలు బృందా కారత్ వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ అనుమతి కోసం పర్యావరణ కమిటీ ముందు ఉందని చెప్పారు. అయితే ప్రాజెక్టు నిర్వాసితులు లక్షలాది మందికి ఎలా పునవాసం కల్పించబోతున్నారనే ప్రశ్నకు మంత్రి సమాధానం దాట వేశారు. దీంతో బృందా కారత్ స్పష్టమైన సమాధానం కోసం పట్టుబట్టారు.
Story first published: Friday, December 23, 2005, 23:53 [IST]