వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలవరంపై హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్
హైదరాబాద్: గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై హైకోర్టు సోమవారంనాడు తీవ్రంగా ప్రతిస్పందించింది. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. రిటైర్డ్ ఇంజనీర్ జి. వెంకటరెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టు ఆ విధంగా ప్రతిస్పందించింది. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నిర్వాసితుల కోసం చేపట్టిన పునరావాస చర్యల గురించి వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే విధంగా కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) అనుమతి పొందడానికి సంబంధించిన సాంకేతికపరమైన అంశాలపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టుకు ఆదీవాసీ కమీషన్ నుంచి అనుమతి పొందారా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Story first published: Friday, December 23, 2005, 23:53 [IST]